ఇంటిగ్రేటెడ్ టమోటా ప్రాసెసింగ్ యూనిట్ స్థాపన రైతులకు ఓ వరం
1 min read
జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష
పత్తికొండ , న్యూస్ నేడు : వెనుకబడిన పత్తికొండ ప్రాంతంలో టమోటా ప్రాసెస్ యూనిట్ స్థాపన టమోటా రైతులకు ఎంతో లాభదాయకమని కలెక్టర్ పి. రంజిత్ భాష అన్నారు. శుక్రవారం పత్తికొండ మండలం, దూదేకొండ రెవెన్యూ గ్రామం, కోతిరాళ్ళ గ్రామ పంచాయతీ మజారా కన్నికదిన్నె గ్రామం వద్ద రూ.11 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటెడ్ టమోటా ప్రాసెసింగ్ యూనిట్ కు రాష్ర్ట పరిశ్రమలు, వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి వర్యులు టీజీ. భరత్, కర్నూలు ఎంపీ బస్ డిపార్ట్ నాగరాజు, స్థానిక శాసనసభ్యులు కేఈ శ్యాం కుమార్ కలిసి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రంజిత్ భాష టమోటా ప్రాసెస్ సింగ్ యూనిట్ స్థాపన వలన ఈ ప్రాంత ప్రజలకు జరిగే ప్రయోజనాలను వివరించారు. టమోటా రైతులకు గిట్టుబాటు ధరతో పాటు ఉపాధి అవకాశాలు కూడా కల్పించబడతాయని చెప్పారు. ఈ ప్రాంతంలో పండే టమోటా రైతులను ప్రోత్సహించడానికి టమోటా ప్రాసెసింగ్ యూనిట్ ఎంతో ఉపయోగకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న , కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు ,ఏపి ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సీఈఓ డా.గెడ్డం. శేఖర్ బాబు, పిడి ఉమాదేవి,ఆర్డీఓ, ఎంఆర్ఓ భరత నాయక్, రమేష్ కుమార్, వాల్మీకి కార్పొరేషన్ డైరక్టర్ బొజ్జమ్మ,తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు తిక్క రెడ్డి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బత్తిన వెంకట్రాముడు, టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు కె.సాంబశివరెడ్డి , శాలివాహన కార్పొరేషన్ మాజీ చైర్మన్ తుగ్గలి నాగేంద్ర, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర, జిల్లా కమిటీ నాయకులు, అధికార యంత్రాంగం పాల్గొన్నారు.
