రైతులు నాణ్యమైన రకాల విత్తనాలను ఎంపిక చేసుకోవాలి
1 min read
ఏరువాక కేంద్రం కో ఆర్డినేటర్ డాక్టర్ అంకయ్య
న్యూస్ నేడు చెన్నూరు : వరి పంటలో నాణ్యమైన రకాలు యాజమాన్యం పద్ధతులు గురించి రైతులు అవగాహన కలిగి ఉండాలని ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ అంకయ్య అన్నారు. బుధవారం మండలంలోని కొక్కరాయపల్లి గ్రామంలో పొలంపిలుస్తుంది కార్యక్రమం నిర్వహించడం జరిగినది .ఈ కార్యక్రమంలో ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ అంకయ్య మాట్లాడుతూ, రైతులకు వరి పటలోని నాణ్యమైన రకాలు వాటి యాజమాన్యం గురించి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా వరి మినీ కిట్స్ ఆర్ జి ఎల్ 7038, ఆర్ జి ఎల్ 7034 రైతులకు సరఫరా చేయడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా రైతులకు వరి సాగులో మెలుకువలు, యాజమాన్య పద్ధతులు, తక్కువ పెట్టుబడి , ఎక్కువ రాబడి వంటి విషయాలపై అవగాహన కల్పించడం జరిగింది.మండల వ్యవసాయ అధికారిని కే శ్రీదేవి మాట్లాడుతూ,మినుము వి బి ఎన్ 7రకాము జొన్న సి ఎస్ వి 41రకాము మినీ కిట్లు ఈ ఖరీఫ్ సీజన్లో రైతులకు సరఫరా చేయబడతాయని తెలియజేశారు.ఈకార్యక్రమం లో ఏ ఈ ఓ. సుధీర్ కుమార్ డి.చరణ్, వి ఏ ఏ కుమార్, కే . రెడ్డి నాగేశ్వరి రైతులు తదితరులు పాల్గొన్నారు.
