PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైసీపీకి భారీ షాక్ టిడిపిలోకి మత్స్యకార కుటుంబాలు

1 min read

పల్లెవెలుగు వెబ్ వెలుగోడు: వెలుగోడు పట్టణంలో అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ శాఖ తగిలింది. గురువారం పట్టణంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి మరియు ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం లో భాగంగా పాత తెలుగుపేట మరియు చాకలి పేటకు చెందిన 120 మత్స్యకార కుటుంబాలు తెలుగు బుడ్డన్న, టైలర్ నాగ స్వామి, ఎల్ల శేషులు ల ఆధ్వర్యంలో శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ… గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అనేక సంక్షేమ పథకాల ద్వారా మత్స్యకారులను ఆదుకున్నామన్నారు. బోట్లు, ఇంజన్లు, వలలు, టూ వీలర్స్‌, ఫోర్‌ వీలర్స్‌ వాహనాలు సబ్సిడీపై అందించామన్నారు. ఫిషర్‌మెన్‌ కోపరేటివ్‌ సొసైటీలకు, మత్స్యకా రులకు సంబంధించి చెరువుల నిర్వహణకు ఆర్థికసాయం, డీజిల్‌పై సబ్సిడీ అందించామన్నారు. మత్స్యకారులకు సంబంధించిన చెరువులను దోచుకోవడానికి 217 జీవో తెచ్చి బడా వ్యాపారస్తులకు అందించడానికి కుట్ర చేస్తున్నార న్నారు. మళ్ళీ మత్స్యకార కుటుంబాల్లో వెలుగు నింపాలంటే తెలుగుదేశం పార్టీ అధికారం లోకి రావాలని ఆకాంక్షించారు, రాష్ట్రంలో రాబోయేది తెలుగుదేశమే.. శ్రీశైలం నియోజకవర్గం లో అఖండ మెజారిటితో గెలవబోయేది బుడ్డా రాజశేఖర రెడ్డినే నని మత్స్యకారులు ఉద్ఘాటించారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభజనం సృష్టించబోతోందనీ.. అందుకు నిదర్శనం మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికలని వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో… తెలుగు రమణ, బాల స్వామి గొల్ల రమణ, చంద్రయ్య, రామారావు, మద్ది లేటి, శివన్న, వెంకట శివుడు, గొల్ల శ్రీను, మల్లయ్య, మద్దిలేటి, శ్రీనివాసులు, రాజు, లింగ స్వామి తదితరులు ఉన్నారు.

About Author