PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏ సైకో కోసం ఇదంతా చేశారు ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీకి చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. సస్పెన్షన్ కాలం పూర్తయినందున మళ్లీ సర్వీసులోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా ఏబీవీ మీడియాతో మాట్లాడుతూ తనపై కావాలనే విషప్రచారం చేశారన్నారు. తన సస్పెన్షన్‌పై ప్రభుత్వ ఎస్‌ఎల్పీని న్యాయస్థానం కొట్టివేసిందన్నారు. చట్ట ప్రకారమే తాను పోరాటం చేశానని వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. ఏ సైకో కళ్లల్లో ఆనందం చూడ్డం కోసం ఇలా చేశారు?.. ఇదంతా జరిగేందుకు కారకులెవరని ఆయన ప్రశ్నించారు. సస్పెన్షన్‌ను ప్రశ్నించడమే తన తప్పా..? అని ఏబీవీ నిలదీశారు.

                          

About Author