భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్
1 min read

పల్లెవెలుగువెబ్ : రెండు రోజుల లాభాలకు బ్రేక్ పడింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలతో ముగిశాయి. శుక్రవారం ఉదయం నుంచి నష్టాలతో ప్రారంభమయ్యాయి. అమెరికా, యూరప్, ఆసియా మార్కెట్ల బాటలో భారత సూచీలు పయనించాయి. మెటల్ సెక్టార్, బ్యాంకింగ్ సెక్టార్లు భారీగా నష్టపోయాయి. నిఫ్టీ 220 పాయింట్లు నష్టపోయి 17172 వద్ద, సెన్సెక్స్ 714 పాయింట్ల నష్టంతో 57197 వద్ద ముగిసింది.

