PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాజ‌కీయాల‌కు గుడ్ బై చెప్పిన కేంద్ర మాజీ మంత్రి

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత బాబుల్ సుప్రీయో సంచ‌ల‌న నిర్ణయం తీసుకున్నారు. శాశ్వతంగా రాజ‌కీయాల‌కు దూరం అవుతున్నట్టు ప్రక‌టించారు. ఈ మేర‌కు త‌న ఫేస్ బుక్ అకౌంట్ లో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. ఇక నుంచి సామాజిక సేవ‌పై దృష్టి పెట్టనున్నట్టు తెలిపారు. కేంద్ర మంత్రి వ‌ర్గం నుంచి బాబుల్ ను తొల‌గించిన కొద్ది రోజుల‌కే ఆయన ఈ నిర్ణయం తీసుకోవ‌డం గ‌మ‌నార్హం. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నివాసాన్ని నెలలో ఖాళీ చేస్తాన‌ని చెప్పారు. త‌ను ఏపార్టీలోకి చేర‌డం లేద‌ని, ప్రజా సేవ రాజ‌కీయాల ద్వార సాధ్యం కాద‌ని స్పష్టం చేశారు. సుదీర్ఘ చ‌ర్చల త‌ర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఇటీవ‌ల బెంగాల్ ఎన్నిక‌ల్లో బీజేపీ త‌ర‌పున బాబుల్ సుప్రీయో పోటీ చేసి ఓట‌మి పాల‌య్యారు. ఈ నేప‌థ్యంలో బీజేపీ అధిష్టానం బాబుల్ వైఖ‌రి ప‌ట్ల అసంతృప్తిగా ఉన్నట్టు స‌మాచారం. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న ఈ నిర్ణయం తీసుకుని ఉండ‌వ‌చ్చని ప‌లువురు విశ్లేష‌కులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

About Author