PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మ‌ద్యం షాపు పై దాడి చేసిన కేంద్ర మాజీ మంత్రి !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత ఉమాభార‌తి మ‌ద్యం షాపును ధ్వంసం చేశారు. మ‌ధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఉన్న ఒక లిక్కర్ షాప్‌కి వందలాది మంది మద్దతుదారులతో వచ్చిన కేంద్ర మాజీ మంత్రి ఉమాభారతి.. షాపులో ఉన్న సీసాలపైకి రాయి విసిరి లిక్కర్ నిషేధంపై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మద్యపాన నిషేధం విధించాలని ఆమె చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. దీనికి ఆమె ఒక డెడ్‌లైన్ సైతం విధించారు. ఈ ఏడాది జనవరి 15లోపు ప్రభుత్వం మద్య నిషేధం విధించాలని లేదంటే రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపడతానని హెచ్చరించారు.

                                                  

About Author