NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వీధి వ్యాపారులపైకి కారు.. నలుగురి మృతి !

1 min read

పల్లెవెలుగువెబ్ : తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కమాన్ చౌరస్తా వద్ద కారు బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకువచ్చిన కారు అదుపు తప్పి డివైడర్‎ను ఢీకొట్టిన కారు వీధి వ్యాపారుల పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంలో చిన్నారికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు..కమాన్ చౌరస్తా వద్దకు చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత డ్రైవర్ పరారైనట్లు పోలీసులు తెలిపారు.

          

About Author