PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గంగమ్మ ఒడి చేరిన గణపయ్య..

1 min read

– ముగిసిన గణపతి నవరాత్రోత్సవములు
పల్లెవెలుగు వెబ్​, శ్రీశైలం: ఈ నెల 10న ప్రారంభమైన వినాయక చవితి ఉత్సవాలు భక్తులు భక్తిశ్రద్ధలతోఅంగరంగవైభవంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా శ్రీ స్వామివారి యాగశాలలో పూర్ణాహుతి ముగిసింది. ప్రతిరోజు రత్నగర్భగణపతిస్వామికి, సాక్షిగణపతిస్వామికి, సాక్షిగణపతి ఆలయములో నెలకొల్పిన మృత్తికాగణపతికి గణపతి హోమం, రుద్రహోమం చేశారు. అదేవిధంగా గణపయ్యకు ప్రతి రోజు ప్రత్యేక పూజలు కొనసాగాయి. సాక్షిగణపతి ఆలయంలో నెలకొల్పబడిన మృత్తికా గణపతిస్వామి వారికి ఆదివారం ప్రత్యేక పూజల అనంతరం లింగాలగట్టులో నిమజ్జనోత్సవం చేశారు.


About Author