PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గౌత‌మ్ రెడ్డి మ‌ర‌ణం.. అందుకే అలా మాట్లాడా !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : వైసీపీ నేతలు దిగజారుడు రాజకీయాలు మానుకోవాలనే తాను గౌతమ్ రెడ్డి మరణంపై స్పందించినట్లు మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి తెలిపారు. ‘‘భూమా నాగిరెడ్డి చనిపోయినప్పుడు వైసీపీ నేతలు చేసింది శవ రాజకీయం. కోడెల చావుకు చంద్రబాబు కారణమని శవరాజకీయం చేసింది కొడాలినాని కాదా. వివేకా హత్యను చంద్రబాబుకు అంటగడుతూ శవరాజకీయం చేసింది ఎవరు?. కోడికత్తి కేసు అడ్డంపెట్టుకుని చేసింది శవరాజకీయం కాదా. శవ రాజకీయాల అలవాటు వైసీపీదని తెలిపే ఉద్దేశం తప్ప ఆ పార్టీ నేతల్ని అనుసరించేతత్వం నాది కాదు. నాకు ఫోన్ చేసి ఎన్నో రకాలుగా బెదిరిస్తున్నారు. వేటికీ భయపడను’’ అని బండారు సత్యనారాయణ స్పష్టం చేశారు.

                                         

About Author