PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బ‌ద్వేల్ లో డిపాజిట్ గ‌ల్లంతు !

1 min read

పల్లెవెలుగు వెబ్​: బ‌ద్వేల్ ఉపఎన్నిక‌లో కాంగ్రెస్, బీజేపీ డిపాజిట్లు గ‌ల్లంత‌య్యాయి. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసినా డిపాజిట్లు గల్లంతయ్యాయని, బద్వేల్ ప్రజలు, సీఎం జగన్‌ వెంటే ఉన్నారని డాక్టర్‌ సుధ అన్నారు. గతంలో కంటే రెట్టింపు మెజార్టీతో గెలిపించారని.. సంక్షేమ పాలనకే ప్రజలు పట్టం కట్టారని డాక్టర్‌ సుధ పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ 76.25 శాతం ఓట్లను సాధించింది. 90,533 ఓట్ల మెజార్టీతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి డాక్టర్‌ సుధ ఘన విజయం సాధించారు. మొదటి నుంచి ప్రతి రౌండ్‌లోనూ వైఎస్సార్‌సీపీ ఆధిక్యతతో దూసుకుపోయింది. వైఎస్సార్‌సీపీకి మొత్తం 1,12,211 ఓట్లు పోలయ్యాయి. బీజేపీకి 21,678 ఓట్లు రాగా, కాంగ్రెస్‌కు మొత్తం 6,235ఓట్లు వచ్చాయి.

About Author