PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ధర్నాకు పాల్గొనుటకు… అనుమతి ఇవ్వండి

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు : ఈనెల 24,25 తేదీలలో విజయవాడలో అలంకార్ సెంటర్ నందు రాష్ట్రస్థాయిలో జరిగే గ్రామ రెవెన్యూ సహాయకులు(విఆర్ఏ)ల ధర్నాలో పాల్గొనుటకు వి ఆర్ఏలకు అనుమతి ఇవ్వాలని మంగళవారం మధ్యాహ్నం మండల తహసిల్దార్ ఎస్.ప్రకాష్ బాబుకు విఆర్ఏలు వినతి పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా విఆర్ఏలు మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు డిమాండ్ల సాధన కొరకు విజయవాడలో రెండు రోజులపాటు ధర్నా నిర్వహించడం జరుగుతుందని గ్రామ రెవెన్యూ సహాయకులకు పే స్కేల్ వేతనం ఇవ్వాలని అదేవిధంగా ఇంటర్ పూర్తి చేసిన వారందరికీ వీఆర్వోలుగా ప్రమోషన్లు కల్పించాలని తదితర డిమాండ్లతో ధర్నా నిర్వహించడం జరుగుతుందని మాకు ఉన్న డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని విజయవాడలో జరిగే ధర్నాకు వెళ్ళుటకు వీఆర్ఏలకు అనుమతి ఇవ్వాలని తహసిల్దార్ కు వినతి పత్రం అందజేసినట్లు మండల కమిటీ నాయకులు రమణ,భూషన్న,తిరుపాలు, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

About Author