NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జిల్లాలో జీఎస్టీ రెవెన్యూ ఆదాయాన్ని పెంచాలి

1 min read

పాత బకాయిలు వసూళ్లకు కృషి చేయాలి

జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

నంద్యాల, న్యూస్​ నేడు: జిల్లాలో జీఎస్టీ రెవెన్యూ ఆదాయాన్ని పెంచడానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి సంబంధిత శాఖ అధికారులు ఆదేశించారు.బుధవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో కమర్షియల్ ట్యాక్స్ శాఖ ఆధ్వర్యంలో.. జిల్లాలో జిఎస్టీ ఆదాయాన్ని పెంచడానికి సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ…. ఆర్థిక వనరులను అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలు సూచనలు ఇవ్వడం జరిగిందని.. ఇందులో భాగంగా జిల్లాలో ఆదాయం పెంచడానికి సంబంధిత శాఖలను సమన్వయం చేసుకుంటూ తగిన చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు. జిల్లాలో సుమారుగా 12,033 మంది పన్ను చెల్లింపుదారులు ఉన్నారన్నారు. జిల్లాలో ఏదైనా నూతన సంస్థ ఏర్పాటు చేస్తుంటే అందుకు తగిన సమాచారాన్ని అందజేయాలన్నారు. అలాగే జిల్లాలో ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు ఉన్నాయని అందులో ఉన్న సిబ్బందికి ప్రొఫెషనల్ టాక్స్ లోకి వచ్చారా లేదా అనేది చూడాలన్నారు. ముఖ్యంగా వస్తువుల(గూడ్స్) కు సంబంధించి రూ.40 లక్షలు, కాంట్రాక్ట్ సర్వీసులకు సంబంధించి 20 లక్షల రూపాయలు దాటిన వారి వివరాలు తెలపాలన్నారు. జిల్లాలో పాత బకాయిలకు సంబంధించి పెండింగ్ ఉన్న వసూళ్లకు వెళ్లేటప్పుడు రెవెన్యూ, పోలీసు శాఖలతో సమన్వయం చేసుకోవాలన్నారు. జిల్లాలో ఎక్కువ శాతం మైనింగ్ లీజులు ఉన్నాయని వారి నుండి అందుకు తగిన జీఎస్టీ పన్ను వసూలు చేసేలా చూడాలన్నారు. ఒక కాంట్రాక్ట్ కు సంబంధించి రూ.2.5లక్షలు దాటితే 1 శాతం సిజిఎస్టీ, 1 శాతం ఎస్జీఎస్టీ వసూలు చేయాలన్నారు. అదే విధంగా ప్రతి నెల 10వ తేదిలోపు జిఎస్టీ 7ఆర్ ను ఫైల్ చేయాలని లేని యెడల ప్రతి రోజు వంద రూపాయలు చొప్పున సంబంధిత డిడిఓ నుండి వసూలు చేయడం జరుగుతోందన్నారు.అంతకుముందు వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమీషనర్ ఎం.సుధాకర్ రావు, డిప్యూటీ కమీషనర్ పి.సురేష్ లు వాణిజ్య పన్నుల శాఖ విధి, విధానాలు, జిఎస్టీ నిర్వహణ, జిఎస్టీ ట్యాక్సేషన్ తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.సమావేశంలో జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా, జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్, నంద్యాల వాణిజ్య పన్నుల శాఖ 1 మరియు 2 సహాయ కమీషనర్లు లక్ష్మీనాయక్, సుజిత, ఆర్డీఓలు విశ్వనాథ్, నరసింహులు, అరుణజ్యోతి, జిల్లా ఖజానా అధికారి లక్ష్మీదేవి, మున్సిపల్ కమీషనర్లు, ఎల్డిఎం, సంబంధిత జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *