NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

హిందూ స్మశాన వాటికను ఎస్సీ లకు స్వాధీనం చేస్తున్నారు..

1 min read

కర్నూలు జిల్లా కలెక్టర్ కి విశ్వ హిందు పరిషత్  వినతి పత్రం

కర్నూలు, న్యూస్​ నేడు:  మేము కర్నూలు జిల్లా మంత్రాలయ, మండలం చెట్నేహళ్లి గ్రామ ప్రజలు/హిందువులు చేసుకుంటున్న విన్నపం ఏమనగా.. మా గ్రామం దాదాపు ఏళ్ల క్రితం వెలిసింది. అప్పటినుండి మేము మా గ్రామ స్మశాన వాటికగా గ్రామ సర్వే నెంబర్లు నెంబర్లు 113 లో 3.83 ఎకరాలు మరియు 114 లో 1.02 ఎకరాలు భూమిని మా గ్రామ అవసర నిమిత్తం హిందూ స్మశానవాటికిగా వాడుకుంటున్నాం. ఈ భూమి రెవిన్యు రికార్డుల్లో ప్రభుత్వ భూమి, రస్తా మరియు సీలింగ్ భూమిగా ఉన్నది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎటువంటి ఆటంకం లేకుండా గ్రామంలో కలిసిమలిసి ఈ స్థలంలో శవ ఖనన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈ మధ్యకాలంలో గత ప్రభుత్వం ఇదే స్థలంలో ఎస్సీ మాదిగ వారికి కొంత భూమి ఇళ్ల స్థలాలుగా/పట్టాలుగా ఇవ్వడం జరిగింది. ఇదిఅక్రమమని మేము అడ్డు చెప్పినా రాజకీయ ఒత్తిడితో ఎస్సీ మాదిగల వారికి ఇచ్చారు.ఇందులో వారు కొందరు ఇళ్ళు నిర్మించారు. ప్రస్తుతం గ్రామంలో ఎస్సీలు ఈ స్థలంలో మా శవఅంతిమ కారక్రమాలు చేసుకోవడదని అడ్డుపడుతున్నారు. మేము వారితో గొడవ పడకుండా ఇబ్బందితో కార్యక్రమాలు చేసుకుంటున్నాము. ఈ కారణంగా గ్రామంలో ఘర్షణ పరిస్థితులు నెలకొన్నాయి. మండలు రెవిన్యు అధికారులు, పోలీస్ అధికారులు కల్పించుకొంటే గాని శవఅంతిమ కార్యక్రమాలు చేసుకోవడానికి వీలులేని పరిస్థితి ఏర్పడింది. ఎస్సీ మాదిగ ముసుగులో క్రిస్టియన్లు చేస్తున్న కుట్రపూరిత దౌర్జన్యం ఇది ఈ విషయంలో గౌరవ ఆదోని సబ్ కలెక్టర్  ఇరువర్గాలకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు 400 ఏళ్ల నుండి హిందువులు ఉపయోగిస్తున్న శృశానం పై రాజీ పడమని చెప్పడం న్యాయంకాదని రాజీపడేది లేదని హిందువులు సబ్ కలెక్టర్ కి తెలపడం జరిగింది .శ్మశానంగా వాడుకుండున్న స్థలంలో ఇళ్ళ పట్టాలు ఇచ్చి రెవెన్యు అధికారులే ఈ సమస్య ఘర్షణకు కారణం అయ్యారు. కొందరికి అక్రమంగా పోసిషన్ పట్టాలు కూడా మంత్రాలయం తహసిల్దార్ ఇవ్వడం జరిగింది. తమరు కల్పించుకొని శ్మశాన స్థలంలో ఇచ్చిన ఇళ్ళ పట్టాలు పొసిషన్ పట్టాలు రద్దు చేయాలి. ఆదోని సబ్ కలెక్టర్ మరియు మంత్రాలయం తహశీల్దార్ కుట్ర పూరితంగా భారీ ముడుపులు తీసుకొని హిందూ స్మశాన వాటికను క్రిస్టియన్స్ ఎస్సీ లకు స్వాధీనం చేస్తున్నారు. కనుక మా మీద దయవుంచి 400 సంవత్సరాల నుండి ఉన్న స్మశాన వాటికను యధావిధిగా కొనసాగించాలని గౌరవనీయులైన జిల్లా రెవిన్యు అధికారి (కలెక్టర్​) కోరడమైనది. దీనికి కారణమైన సబ్ కలెక్టర్, ఎంఆర్ఓ, రెవెన్యు అధికారుల పై చర్యలు తీసుకోవాలని ప్రస్తుత శ్మశానంలో శవ అంతిమ కార్యక్రమాలకు అడ్డుపడుతు హిందువులతో ఘర్షణ పడుతన్న క్రిస్టియన్లు/ ఎస్సీ మాదిగలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము.ఇట్లు టిసి. మద్దిలేటి విశ్వహిందూ పరిషత్ కర్నూలు జిల్లా అధ్యక్షులు, టి.ప్రతాప్ రెడ్డి విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర విశేషాలు సంపర్క ప్రముఖ, శివ సాయినాథ్, గుజరాతి సురేష్, సల్కాపురం బాబురావు,చెట్నేహళ్లి గ్రామ ప్రజలు కర్నూలు జిల్లా కలెక్టర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ కి అందజేయడమైనది.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *