NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సంక్షేమ పథకాలు నిరాశ్రయులైన అనాధ  పిల్లలకు అందాలి…

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి  లీలా వెంకట శేషాద్రిరి ఆదేశాల మేరకు  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ  దిశా నిర్దేశాలతో నిరాశ్రయులైన అనాధ  పిల్లలను గుర్తించి వారికి ఆధార్ కార్డులను జారీ చేయించి ప్రభుత్వ  సంక్షేమ పథకాలను అందజేయడానికి  ఈ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని  డి .సి పి .ఓ శారద అన్నారు. ఇందిరాగాంధీ నగర్ లో  సాతి అవగాహన సదస్సులో  జిల్లా సాది కమిటీ సభ్యులు  లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలైన విద్యా ,వైద్యం, పునరావసం షెల్టర్ హోమ్లలో ప్రవేశం కల్పించడం ,స్కాలర్షిప్స్, మిడ్ డే మీల్స్ సదుపాయాల అర్హత కల్పించడం కోసం   రోడ్డు పక్కన నివసిస్తున్న పిల్లలు, అనాధలు ,తల్లిదండ్రుల నుండి విడిపోయిన వారిని గుర్తించి వారికి ఆధార్ కార్డు ఇప్పించడం జరుగుతున్నదని అవసరమైన పిల్లలకు ఉచిత న్యాయ సలహాలను అందించడం జరుగుతుందన్నారు.కార్యక్రమంలో, మహిళా పోలీసు రాధిక ,అడ్వకేట్ శ్రీలక్ష్మి, స్వాతి కమిటీ సభ్యులు సుధారాణి, ఐ.సి.డి.ఎస్ సిబ్బంది శ్వేత కీర్తి ,నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *