మండలాల్లో ఆదర్శ ప్రైమరీ పాఠశాలలు..
1 min read
పాధ్యాయుల బదిలీలు-ఎంఈఓ లు శ్రీనాథ్,సుభాన్..
మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్ నేడు :ఐదు సంవత్సరాల పాటు ఉపాధ్యాయులుగా పనిచేసిన వారు బదిలీలు అయ్యారు. నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలో వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్న 37 మంది టీచర్లు ఇతర మండలాలకు బదిలీపై వెళ్లినట్లు వీరిలో 10 మంది ఉపాధ్యాయులు పదోన్నతిపై వెళ్లినట్లు ఎంఈఓ-2 కే.శ్రీనాథ్ తెలిపారు.వివిధ మండలాల నుండి మిడుతూరుకు 48 మంది టీచర్లు వచ్చారు. మండలంలో 12 మోడల్ ప్రైమరీ(1 నుండి 5 వరకు) పాఠశాలలను ప్రభుత్వం ఎంపిక చేసినట్లు కలమందలపాడు,కడుమూరు, దేవనూరు,చింతలపల్లి, మిడుతూరు (రెగ్యులర్), అలగనూరు,తలముడిపి (స్పెషల్),రోళ్లపాడు, అలగనూరు,నాగలూటి, వీపనగండ్ల (స్పెషల్) పాఠశాలలు ఆదర్శ మండల పరిషత్ పాఠశాలలుగా ఎంపిక అయినట్లు ఈ పాఠశాలల్లో ఐదు తరగతులకు 5 మంది టీచర్లు ఉంటారని ఎంఈఓ తెలిపారు.అదే విధంగా నందికొట్కూరు (పట్టణం మరియు రూరల్)లో-21,పగి డ్యాలలో-8 మోడల్ ప్రైమరీ పాఠశాలలు ఎంపిక అయినట్లు ఎంఈఓ సుభాన్ అన్నారు.