మెదడుకు పదును పెట్టే చెస్ క్రీడలో రాణిస్తే చదువులోనూ రాణిస్తారు
1 min read
ఒలంపిక్ డే వేడుకల్లో భాగంగా చెస్ క్రీడను ప్రారంభించిన సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ
కర్నూలు , న్యూస్ నేడు: విద్యార్థుల్లో ఏకాగ్రతను పెంచే చెస్ క్రీడలో సాధన చేయడం వల్ల వారు చదువులోనూ మరింత రాణిస్తారని సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు .కర్నూల్ నగరంలోని క్రీడా ప్రాధికార సంస్థ ప్రాంగణంలో ఒలంపిక్ డే వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన చెస్ క్రీడా పోటీలను ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ చదరంగంగా పిలువబడే చెస్ క్రీడ పురాణాల కాలం నుంచి ప్రచారంలో ఉందని చెప్పారు. మిగతా క్రీడలతో పోలిస్తే చెస్ క్రీడా వ్యక్తిగత సామర్థ్యంతో రాణించే క్రీడని వివరించారు .మిగతా క్రీడల్లో క్రీడాకారులు అధికంగా ఉంటారని వారు సమిష్టిగా రాణిస్తేనే ఆ క్రీడల్లో విజయం సాధించే అవకాశం ఉంటుందని చెప్పారు. అలాగే క్రీడాకారులు ఎక్కువగా ఉండటం వల్ల వారిలో ఈగో ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందని చెప్పారు. కానీ చెస్ క్రీడలో ఒకరు మాత్రమే ఉండడం వల్ల అలాంటి అవకాశం ఉండదని చెప్పారు .చెస్ క్రీడలో పాల్గొనడం వల్ల ఏకాగ్రత పెరుగుతుందనిజ అలాగే ఎదుటివారి ఎత్తుగడలను పసిగట్టే ఆలోచన శక్తి కూడా పెరుగుతుందని చెప్పారు. చెస్ క్రీడ వల్ల నిశ్శబ్దంలో ఏకాగ్రత పెరుగుతుందని చెప్పారు. దీనివల్ల ఆలోచన శక్తి పెరిగి సైన్స్ లోనూ రాణించే అవకాశం ఉందని తెలిపారు .ఒకరకంగా చెప్పాలంటే సాధన చేయడం వల్ల జీవితం పై అవగాహన కలుగుతుందని వివరించారు . చెస్ క్రీడలో జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలంటే పూర్తి సమయం దానికి కేటాయించాల్సిన అవసరం ఉందని, అలా కాకుండా తాత్కాలికంగా ఈ క్రీడలో సాధన చేసి చదువులోనూ రాణించి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని చెప్పారు. చెస్ క్రీడలో పాల్గొనడం వల్ల విద్యార్థులు సమాంతరంగా అభివృద్ధి చెందుతారని చెప్పారు. చెస్ క్రీడల్లో రాణించిన వారు జీవితంలో అత్యున్నత స్థాయికి చేరుకున్న వారు ఉన్నారని చెప్పారు. చెస్ క్రీడలో కూర్చొని ఆడటం జరుగుతుందని, ఈ క్రీడ సాధన చేసేవారు వ్యాయామాన్నీ కూడా అలవాటు చేసుకోవాలని చెప్పారు. దీనివల్ల శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని వివరించారు .విద్యార్థులు క్రీడలకే పరిమితం కాకుండా సమాజం పట్ల అవగాహన పెంపొందించుకొని జీవితంలో ముందుకు సాగాలని సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర శర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయక్, రేణుక ,చిన్న సుంకన్న తదితరులు పాల్గొన్నారు.