NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ద‌మ్ము, ధైర్యం ఉంటే చ‌ర్చ‌కు రావాలి !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : టీడీపీ నేతలకు నిజంగా దమ్ము, ధైర్యం ఉంటే ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పధకాలపై చర్చకు రావాలని సవాల్ విసిరారు మంత్రి ఆదిమూల‌పు సురేష్‌. ఎన్నోసార్లు చర్చకు రావాలని పిలిచినా టీడీపీ నేతల నుండి స్పందన లేదన్నారు. చంద్రబాబు తాజాగా కొత్త పొత్తులకు తెరలేపటం ఆయన ముసుగు తొలిగిందని అన్నారు. అందరం కలిసి మూకుమ్మడిగా పోటీ చేస్తే వైసీపీ మీద గెలవలేమని ఒప్పుకున్నట్లైందని తెలిపారు. సీఎం జగన్ అమలు చేసిన నవరత్నాలతోనే వైసీపీ ఎప్పుడైనా ఎన్నికలకు వెళ్తుందని చెప్పారు. టీడీపీ దివాళా కోరుతనం మరోసారి ప్రజలకు తెలిసిందన్నారు. గతంలో వైసీపీ గెలిచిన సీట్ల కన్నా ఎక్కువ గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

                                        

About Author