PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కర్నూలులో ఏవీధికి వెళ్లినా.. సమస్యలే..: టిజి భరత్

1 min read

పల్లెవెలుగు: కర్నూల్ నగరంలో ఏ వీధికి వెళ్లినా సమస్యలే దర్శనమిస్తున్నాయని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టిజి భరత్ అన్నారు. కర్నూలు నగరంలోని 5వ వార్డు పరిధిలోని చిత్తారి వీధిలో ఆయన వార్డు పర్యటన చేపట్టి ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిశారు. భవిష్యత్తుకు గ్యారెంటీ కరపత్రాలను ప్రజలకు అందించి టిడిపి మొదటి విడత మేనిఫెస్టోను వివరించారు. వార్డు పర్యటనకు వచ్చిన టీజీ భరత్ కు ప్రజలు సమస్యలు చెప్పుకున్నారు. డ్రైనేజీలు క్లీన్ చేయడం లేదని, అర్హత ఉన్నప్పటికీ పింఛన్ అందడం లేదని మొరపెట్టుకున్నారు. ఈ సందర్భంగా టిజి భరత్ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ప్రజల సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని హామీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు విజనరీ లీడర్ అని.. ఆయన వస్తేనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందన్నారు. రాష్ట్రం అభివృద్ధి కావాలని కోరుకునేవారు చంద్రబాబు నాయుడుకు ఓటు వేయాలని.. కర్నూలు అభివృద్ధి కోసం తనకు ఓటు వేయాలని భరత్ అభ్యర్థించారు. తన తండ్రి కంటే ఎక్కువగా అభివృద్ధి చేసేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు. ఒక అవకాశం ఇచ్చి తన పనితీరు చూడాలని ప్రజలను ఆయన కోరారు. ఇక ఇంటింటికి వెళ్లి ఆయన ప్రజలను కలుస్తున్న సమయంలో టిజివి సంస్థల ఆధ్వర్యంలో చేపట్టిన ఉచిత వైద్య పరీక్షల కరపత్రాలను కూడా అందించారు. రూ. 3 వేల రూపాయలు విలువ చేసే వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తున్నామని ప్రజలందరూ వెళ్లి గుండెకు సంబంధించిన వైద్య పరీక్షలు తప్పకుండా చేపించుకోవాలని కోరారు. కర్నూలు బాగుకోసం తనకు ఓటు వేయాలని ప్రజలను ఆయన కోరారు. ఏ వీధికి వెళ్ళినా సమస్యలు దర్శనమిస్తున్నాయని.. తనకు ఓటు వేస్తే సమస్యలు లేని కర్నూలుగా చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు బాలు, షఫీవుల్లా, రాజ్యలక్ష్మి, భాస్కర్, నాగరాజు, సురేష్, సుశీలమ్మ, ఇంద్రజ, శ్రీనివాసులు, విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

About Author