PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కువైట్​లో.. ఘనంగా టీడీపీ మహానాడు వేడుకలు

1 min read

పార్టీకి పూర్వవైభవం తీసుకొస్తాం: టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పట్టాభి రామ్

పల్లెవెలుగువెబ్​, అన్నమయ్య జిల్లా రాయచోటి: టి డి పి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరపు అచ్చెన్నాయుడు గారు నారా లోకేష్ బాబు గారి  ఆదేశాల మేరకు కువైట్ లో ఘనంగా టిడిపి మహానాడు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమం టిడిపి కువైట్ అధ్యక్షులు సుధాకర్ రావు,మరియు కార్యకర్తల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులు గా రాష్ట్ర అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి రామ్  గారు  మరియు సాంస్కృతిక విభాగం అధ్యక్షులు పతంగాని నరసింహా ప్రసాద్ గారు హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూదేశం కాని దేశం కువైట్ లో ఇంత  పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కార్యకర్తలు ఉండడం శుభ పరిణామం అన్నారు. మహానాడు  కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగడానికి కృషి చేసిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు  దివంగత మహానేత అన్న నందమూరి తారకరామారావు గారి స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీ మహానాడు జరుపుకోవడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో  పెద్దలు తెలుగు దేశంపార్టీ  కువైట్ అధ్యక్షులు కుదరవల్లి సుధాకర్ రావు,  మైనారిటీ అధ్యక్షుడు షేక్ చాన్ భాష పి ఆర్ ఓ మదిన ఈశ్వర్ నాయుడు గారు బోయపాటి శ్రీను అధికార ప్రతినిధి భాషా గారు ప్రోగ్రాం కన్వీనర్ ఈడుపుగంటి ప్రసాద్ గారు వి సి సుబ్బారెడ్డి  తెలుగు దేశం కువైట్ తెలుగు యువత వంశీ తదితరులు పాల్గొన్నట్లు కువైట్ ఎన్ ఆర్ ఐ టిడిపి నాయకులు షేక్ ఛాన్ బాష తెలిపారు.

About Author