PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలలో.. తృతీయ స్థానం కైవసం

1 min read

పల్లెవెలుగు, వెబ్​ కర్నూలు: ఇటీవల నెల్లూరులో జరిగిన రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలలో కర్నూలు జిల్లా విద్యార్థిని గాయత్రి జూనియర్స్ బాలికల అండర్ 55 వెయిట్ క్యాటగిరి విభాగంలో పాల్గొని మొదటి రౌండ్లో నాలుగు పాయింట్లు తేడాతో గెలుపొంది రెండవ రౌండ్లో 2 పాయింట్ల తేడాతో గెలుపొంది మూడవ రౌండ్ లో ఒక పాయింట్ తేడాతో తృతీయ స్థానాన్ని కైవసం చేసుకుంది.ఈ సందర్భంగా మౌర్య ఇన్ లోని టీజీ భరత్ గారి ఛాంబర్ లో అభినందన సభ ఏర్పాటు చేసి అమ్మాయికి మెడల్ మరియు మెమొంటోతో సత్కరించారు ఇంకా కృషి మంచి సాధన చేసి జాతీయస్థాయిలో రాణించాలని విద్యార్థినికి తెలియజేశారు విద్యార్థులకు తల్లిదండ్రులు కూడా సహకరించాలని కొనియాడుతూ శిక్షకుడు సతీష్ కుమార్ ని అభినందించారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ ఫిట్నెస్ అండ్ సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ హానరబుల్ ప్రెసిడెంట్ న్యాయవాది ఆనందరావు గారు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

About Author