భారతీయ రైల్వే భారత్ గౌరవ్ రైలు ఆషాడ అమావాస్య ప్రత్యేక శక్తిపీఠ యాత్ర
1 min read
విజయవాడ, న్యూస్ నేడు: భారతీయ రైల్వే మొదటి భారత్ గౌరవ్ రైలు, సౌత్ స్టార్ రైల్, భారతదేశంలోని అతిపెద్ద టూరిస్టు రైలు ఆపరేటర్ టూర్ టైమ్స్ సంయుక్త కలయికతో ఆషాడ అమావాస్య సందర్భంగా ప్రత్యేక శక్తిపీఠ యాత్ర నిర్వహిస్తున్నట్లు భారతీయ రైల్వే భారత్ గౌరవ్ రైలు ప్రోడక్ట్ డైరెక్టర్ జి విఘ్నేష్ వెల్లడించారు. శనివారం, గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో టూర్ టైమ్స్ ఆపరేషన్ మేనేజర్విధుల తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆషాడం అమావాస్య సందర్భంగా పిండ దానం చేసే ప్రత్యేక అవకాశంతో శక్తిపీఠ యాత్ర కొనసాగుతుందన్నారు. కామాఖ్య, పూరి, కోల్కత్తా, గయా, కాశి, అయోధ్య, ప్రయోగరాజ్, శక్తిపీఠాలకు ప్రయాణాన్ని ప్రకటించినట్లు తెలిపారు. ఈ ప్యాకేజీ. జూలై 16వ తేదీ నుండి ప్రారంభమవుతుందని, టూర్ ప్యాకేజీ వ్యవధి 12 రోజులకు గాను యాత్రికులకు ప్యాకేజీ పై 33శాతం రాయితీ కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. టూర్ ప్యాకేజీ లో భాగంగా యాత్రికులకు దారి పొడవునా యాత్ర విశేషాలను వివరించేందుకు పి ఏ సిస్టమ్స్, కోచ్ సెక్యూరిటీ, టూర్ మేనేజర్లు, ట్రావెల్ ఇన్సూరెన్స్, వసతి, సందర్శనార్థం బస్సులు, భోజన పలహారాలతో సహా వివిధ రకాల వసతి సౌకర్యాలను కల్పిస్తున్నట్లు వెల్లడించారు. యాత్రికులు ఎల్ టి సి, ఎల్ ఎఫ్ సి సౌకర్యాన్ని కూడా పొందవచ్చు అన్నారు. గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, విజయవాడ ల నుండి పర్యాటకులు రైలు ఎక్కడానికి వీలు కల్పిస్తున్నామన్నారు. ఈనెల 17వ తేదీ విజయవాడ నుండి రైలు యాత్రకు బయలుదేరుతుందన్నారు.యాత్ర చేయదలచినవారు 9355 0210 516 నెంబర్ కు కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు అన్నారు. ఆన్ లైన్ లో బుక్ చేసుకోవడానికి www.tourtimes.in ను సందర్శించవచ్చు అన్నారు.
