అంతర్ రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టు ఆకస్మిక తనిఖీ
1 min read
హొళగుంద , న్యూస్ నేడు: అంతర్ రాష్ట్ర సరిహద్దు హోళగుంద చెక్ పోస్టును ( ఆంధ్ర – కర్ణాటక బార్డర్ ) ఆకస్మిక తనిఖీ చేసినకర్నూలు జిల్లా ఎస్పీ.చెక్ పోస్టులలో అక్రమ రవాణ ను కట్టడి చేయాలి. అంతర్ రాష్ట్ర సరిహద్దు హోళగుంద చెక్ పోస్టును ( ఆంధ్ర – కర్ణాటక బార్డర్ ) కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. అక్రమ రవాణ జరగకుండా కట్టడి చేయాలని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.చెక్ పోస్టులో పకడ్బందీగా విధులు నిర్వహించాలన్నారు. ఆలూరు సిఐ వెంకటచలపతి , హోళగుంద ఎస్సై బాల నరసింహులు , ఎక్సైజ్ పోలీసులు పాల్గొన్నారు.