NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మ‌హోన్న‌త మాహిష్మ‌తి రాజ్యం నుంచి ఆస‌క్తిక‌ర వార్త !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : బాహుబ‌లి -3 గురించి ఆస‌క్తిక‌ర అప్ డేట్ ఇచ్చారు రాజ‌మౌళి. తాజాగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రమోషన్‌లో భాగంగా దర్శకుడు రాజమౌళి ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘‘బాహుబలి’, ‘బాహుబలి–2’ సినిమాలతో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పారు. మీ నుంచి ‘బాహుబలి–3’ చిత్రాన్ని ఆశించవచ్చా? అని అడగ్గా ‘‘తప్పకుండా ఆశించవచ్చు. ‘బాహుబలి’ చుట్టూ జరిగే ఎన్నో సంఘటనలు తదుపరి ‘బాహుబలి’ చిత్రంలో చూపించనున్నాం. దీనికి సంబంధించి వర్క్‌ చేస్తున్నాం. మా నిర్మాత శోభు యార్లగడ్డ ఈ విషయంలో పాజిటివ్‌గా ఉన్నారు. అయితే దీనికి కాస్త సమయం పట్టొచ్చు. మహోన్నత మాహిష్మతి రాజ్యం నుంచి ఆసక్తికరమైన వార్త రానుంది“ అని అన్నారు.

                                                   

About Author