PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఊట సముద్రం గ్రామంలో పామాయిల్ రైతులతో ముఖాముఖి 

1 min read

పార్టీ అధికారంలోకి రాగానే సమస్యలన్నీ చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తాం

పార్లమెంట్ అభ్యర్థి పుట్ట  మహేష్ కుమార్, అసెంబ్లీ అభ్యర్థి సొంగ రోషన్ కుమార్

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : చింతలపూడి నియోజకవర్గం ఊటసముద్రం గ్రామంలో పామాయిల్ రైతులతో  ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా పామాయిల్ రైతుల సమస్యలను తెలుసుకొని మన ఉమ్మడి తెలుగుదేశం, జనసేన, బిజెపి, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వాళ్ళ సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే అభ్యర్థి రోషన్ కుమార్, ఎంపీ అభ్యర్థి మహేష్ కుమార్ తెలిపారు.ఈ కార్యక్రమంలో భాగంగా చింతలపూడి నియోజకవర్గ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి సొంగ రోషన్ కుమార్, ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి  పుట్టా మహేష్ కుమార్ యాదవ్ తో నియోజకవర్గ లో పలువురు పామాయిల్ రైతులు ఆయనతో సమావేశం అయ్యారు. వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గిట్టుబాటు ధరలను పలు రకాల అంశాలను వారి  ముందు ఉంచారు. పార్టీ అధికారంలో రాగానే సమస్యలన్నీటిని చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.ఈ  కార్యక్రమoలో పలువురు రైతులు నాయకులు పాల్గొన్నారు.

About Author