వృద్ధులకు భద్రత కల్పించాల్సిన బాధ్యత మన అందరిదీ
1 min read
పి .ఎల్. వి లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్.
కర్నూలు, న్యూస్ నేడు: ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణ అవగాహన దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ ఈ లీల వెంకట శేషాద్రి ఆదేశాల మేరకు లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్, నైస్ స్వచ్ఛంద సేవా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో మన వృద్ధుల ఆశ్రమంలో పి. ఎల్. వి లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన అవగాహన కార్యక్రమంలో రిటైర్డ్ డి.ఎస్పీ న్యాయవాది పాపారావు మాట్లాడుతూ 2006 సంవత్సరం నుండి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఆదేశాల మేరకు ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణ అవగాహన దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని అన్నారు .లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ వృద్ధులను నిర్లక్ష్యం చేయరాదని వారికి ఆర్థిక మానసిక ఆరోగ్య భద్రత కల్పించవలసిన బాధ్యత పిల్లలదేనని, బాధితులు ఎవరైనా ఉంటే జిల్లా న్యాయ సేవాధికారిక సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయాన్ని పొందవచ్చు అన్నారు. లయన్ పద్మశాలి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వృద్ధులను అవమానించడం, వారి ఆస్తి డబ్బులను బలవంతంగా తీసుకోవడం చేయరాదన్నారు. రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ ఉపాధ్యక్షులు లయన్ మురారి శంకరప్ప మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా సీనియర్ సిటిజన్స్ కు అందిస్తున్నటువంటి పథకాలను వివరించారు. రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ అధ్యక్షులు కే.డి. జే బాబు మాట్లాడుతూ మానసిక ధైర్యంతో జీవితంలో వచ్చే వడిదొడుకులను ఎదుర్కోవాలన్నారు .వయసు మీదకు వచ్చిన వృద్ధులను శారీరకంగా మానసికంగా ఆర్థికంగా లేదా భావోద్వేగాపూర్వకంగా బాధించడం పట్టించుకోకపోవడం చేయరాదు అన్నారు. అనంతరం వృద్ధులకు పళ్ళు, సబ్బులు ఇతర నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.