విష ప్రచారం ఇక మానుకోవాలి జగన్
1 min read
ఆలూరు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వర్యులు బి. వీరభద్ర గౌడ్
న్యూస్ నేడు ఆలూరు : ఆలూరు మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన, ఆలూరు టీడీపీ ఇంచార్జ్ బి. వీరభద్ర గౌడ్. కూటమి ప్రభుత్వం చెప్పిన విధంగా హామీలను, ఒకటి అయినా తర్వాత మొరొకటి హామీలను కచ్చితంగా నిర్వర్తిస్తాము అని తెలిపారు. తల్లికివందనం స్కీం ద్వారా నేరుగా తల్లుల ఖాతాలో ఒకరికి 13000/- జామ చేసాము. ఇచ్చిన హామీ ప్రకారం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికివందనం అందించాము అన్నారు. రాష్ట్రామాంతటా పండుగ వాతావరణంతో అందురూ సంతోషంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, మరియు ఉపముఖ్యమంత్రి కొనిదేల పవన్ కళ్యాణ్ ఫొటోలకు పాలాభిషేకం చేస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డికి, వైసీపీ నాయకులు మాత్రం రాష్ట్రంలో అభివృద్ధి మరియు సంక్షేమం చేస్తున్నది కనిపిస్తలేదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజలు బుద్ధిచెప్పారు, 2029లో కూడ బుద్ది చెపుతారు, ప్రజలు అన్ని గమనిస్తున్నారు. జగన్ & కో మరియు వైసీపీ నాయకులు విషప్రచారాలు మానుకోవాలని, హితబూ పలికారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మరియు జనసేన, బీజేపీ నాయకులు, బీవీజీ అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.