NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శంకరాస్ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా…

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణ శాఖ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము వారి ఆధ్వర్యం లో నిరుద్యోగ యువతీ, యువకుల కొరకు శ్రీ శంకరాస్ డిగ్రీ కళాశాల, గాయత్రి ఎస్టేట్, కర్నూలు నందు జాబ్ మేళా నిర్వహించటం జరుగుతుందని కళాశాల ప్రిన్సిపాల్ ఎం.శ్రీనివాసులు  పత్రికా ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళాలో ప్రముఖ కంపెనీలు అయిన యస్.వి.సి. సినిమాస్, ముత్తూట్ ఫైనాన్స్, అరోర్ ఫార్మా  కంపెనీలలో ఉద్యోగాల కొరకు ఇంటర్వ్యూలు నిర్వహించటం జరుగుతుంది.ఈ జాబ్ మేళా కి హాజరయ్యే అభ్యర్థులు పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ చదివిన వారు అర్హులు. అలాగే ఈ జాబ్ మేళా కి హాజరయ్యే వారికి 18 సం.రాల నుండి 30 సం.రాల లోపు వయస్సు కలిగిన వారు అర్హులు. సెలెక్ట్ అయిన అభ్యర్ధులందిరికి నెలకి 15000/- రూపాయల వరకు జీతం ఉంటుందని తెలియజేశారు.కావున జిల్లాలోని అర్హత కలిగిన నిరుద్యోగ యువతీ యువకులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని, వారు ఈ నెల 1వ తేదీన  (అనగా శుక్రవారము) నేరుగా వారి  బయోడేటా, సర్టిఫికేట్ లతో ఇంటర్వ్యూకు శ్రీ శంకరాస్ డిగ్రీ కళాశాల, గాయత్రి ఎస్టేట్, కర్నూలు నందు హాజరు కావాలని తెలియజేయటం జరిగింది.అర్హత కలిగిన అభ్యర్థులు ఈ క్రింది లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోగలరు:www.apssdc.in మరిన్ని వివరాల కోరకు 9676141731, 9059290821 నంబర్లను సంప్రదించగలరు.

About Author