పరిశ్రమల ఏర్పాటుతో యువతకు ఉద్యోగాలు
1 min read
పరిశ్రమలు,వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి టీజీ భరత్…
కర్నూలు, న్యూస్ నేడు : రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం జిల్లా కు పరిశ్రమలు తీసుకుని రావడానికి, విధ్యాభివృద్ధికి చాలా కృషి చేస్తున్నదని పరిశ్రమలు,వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు.శనివారం ఉదయం కర్నూలు పట్టణ ఉస్మానియా కాలేజీ ఆవరణలో నిర్మించిన రాష్ట్రీయ ఉచ్ఛతర శిక్ష అభియాన్ ( రూసా ) ఆధ్వర్యంలో ఒక కోటి రూపాయలతో నిర్మించిన అదనపు తరగతుల భవనాన్ని ప్రారంభించిన రాష్ట్ర పరిశ్రమలు,వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి టీజీ. భరత్. ఈ కార్యక్రమంలో ఎంపీ బస్తిపాటి నాగరాజు ,మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కాలేజీ విద్యార్థులు మరియు సిబ్బందిని ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ… ఉస్మానియా కళాశాల పూర్వపు విద్యార్థి అయిన నేను రాష్ట్ర మంత్రిగా రూసా నిర్మించిన అదనపు తరగతుల భవనాలను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. కళాశాలలోని సిబ్బంది అందరితోనూ నాకు పరిచయాలు ఉన్నాయని తెలిపారు. ఈ కళాశాలలో చదువుకున్న వారిలో చాలామంది విదేశాల్లో స్థిరపడ్డారని , రాజకీయాల్లో కూడా బాగానే రాణిస్తున్నారని తెలిపారు. ఈ కళాశాలలో మంచి అనుభవం ఉన్న సిబ్బంది ఉన్నారని విద్యార్థులు దీనిని సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలని కోరారు. ఈ సందర్భంగా ఎంపీ బస్తిపాటి నాగరాజును ఉద్దేశించి లెక్చరర్ గా అనుభవం ఉన్న మీరు ఈ కాలేజీ విద్యార్థులకు లెక్చరర్ గా మరియు మెంబర్ అఫ్ పార్లమెంట్ గా ఉన్న మీ అనుభవాన్ని విద్యార్థులతో పంచుకోవాలని మంత్రి కోరారు . ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ మరియు ఎంపీ బస్తిపాటి నాగరాజును ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు , మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు , కాలేజీ ప్రిన్సిపల్ ఎస్ ఎస్ ముజామిల్, సెక్రటరీ మరియు కరస్పాండెంట్ శ్రీమతి ఆజ్రా జావేద్, రూస ఇంచార్జ్ డాక్టర్ ఎస్. గజని, కార్పొరేటర్ పరమేష్ , కళాశాల సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
