PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టీ20 చరిత్రలో కొహ్లీ అరుదైన రికార్డు

1 min read

పల్లెవెలుగువెబ్ : ఇంగ్లండ్ తో టీ20 వరల్డ్ కప్ సెమీస్ లో టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్ లో అర్ధసెంచరీ సాధించిన కోహ్లీ, అంతర్జాతీయ టీ20 చరిత్రలో 4 వేల పరుగులు మైలురాయిని అందుకున్న తొలి బ్యాట్స్ మన్ గా రికార్డు పుటల్లోకెక్కాడు. ఇంగ్లండ్ తో మ్యాచ్ లో 42 పరుగులు చేసిన అనంతరం కోహ్లీ ఈ ఘనత అందుకున్నాడు. ఇప్పుడు పురుషుల అంతర్జాతీయ టీ20 పోటీల్లో అత్యధిక పరుగుల వీరుడు కోహ్లీనే. ఇప్పటిదాకా 115 అంతర్జాతీయ టీ20 మ్యాచ్ లు ఆడిన కోహ్లీ 52.74 సగటు, 137.97 స్ట్రయిక్ రేట్ తో మొత్తం 4,008 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, 37 అర్ధసెంచరీలు ఉన్నాయి.

About Author