ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమాలు ఉధృతం చేద్దాం…
1 min read
శాఖ మహాసభను ఉద్దేశించి మాట్లాడుతున్న సిపిఐ జిల్లా కార్యదర్శి బి గిడ్డయ్య
పత్తికొండ, న్యూస్ నేడు: కేంద్ర, రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమాలు ఉదృతం చేద్దామని సిపిఐ జిల్లా కార్యదర్శి బి. గిడ్డయ్య పిలుపునిచ్చారు. ఆదివారం మండలంలోని దూదేకొండ సిపిఐ శాఖ మహాసభ శాఖ కార్యదర్శి రాముడు అధ్యక్షతన ఘనంగా జరిగాయి. ముందుగా పార్టీ పతాకాన్ని సిపిఐ జిల్లా కార్యదర్శి బి. గిడ్డయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నరేంద్ర మోడీ అధికారంలోకి రాకముందు తాము అధికారంలోకి వస్తే పెంచిన ధరలను తగ్గిస్తామని, ప్రతి ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రజలకు హామీ ఇచ్చి, మూడు దఫాలుగా అధికారంలో ఉన్నప్పటికీ ఏ ఒక్క హామీని నెరవేర్చింది లేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో 90 శాతం సబ్సిడీతో విత్తనాలు ఎరువులను పంపిణీ చేయాలన్నారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల ఖాతాలలో తక్షణమే 20వేల రూపాయలు జమ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి డి. రాజా సాహెబ్, జిల్లా కార్యవర్గ సభ్యులు కారుమంచి, జిల్లా సమితి సభ్యులు కారన్న, పెద్ద ఈరన్న, కృష్ణయ్య, ప్రజా సంఘాల నాయకులు రంగన్న, నెట్టికంటయ్య, ఆంజనేయ, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
