NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నిరుద్యోగ భృతి పై ఉద్యమిద్దాం ….

1 min read

కరపత్రాలను విడుదల చేసిన ఏఐవైఎఫ్

పత్తికొండ, న్యూస్​ నేడు:  ఎన్నికలకు ముందు నిరుద్యోగులకు భృతి ఇస్తామని చెప్పిన చంద్రబాబు ఎన్నికలలో గెలిచిన తర్వాత నిరుద్యోగ భృతి హామీని మరచిపోయారని ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు హనుమేష్, మండల కార్యదర్శి అల్తాఫ్ అన్నారు. బుధవారం స్థానిక పత్తికొండ సిపిఐ చదువుల రామయ్య భవనంలో ఈ మేరకు ఏఐవైఎఫ్ కరపత్రాలను కరపత్రాలను విడుదల చేశారు. నిరుద్యోగ భృతిని సాధించడం కోసం నిరుద్యోగ ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలనివారు పిలుపునిచ్చారు. మన రాష్ట్రంలో అధికారంలో రాకముందు ప్రచారంలో భాగంగా చంద్రబాబునాయుడు  నిరుద్యోగ భృతి కింద ప్రతి నిరుద్యోగ యువతకు నెలకు 3000 చొప్పున నిరుద్యోగ మృతి ఇస్తామని  ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు  హామీ ఇచ్చారని తెలిపారు. అధికారం లోకి వచ్చి ఏడాది పూర్తయిన నిరుద్యోగ భృతి ఊసే లేదని వాపోయారు. లక్షలాది మంది నిరుద్యోగులు నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారా అని ఎదురుచూస్తున్నారని తెలిపారు. 2025 ఫిబ్రవరి నెలలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ద్వారా నిర్వహించిన స్కేల్ సెన్సెక్స్ సర్వే 26 జిల్లాల్లో 2.65 కోట్ల మంది దగ్గర వివరాలు సేకరించగా ఉపాధి లేని వారి సంఖ్య కోటిన్నర పైనే ఉందని అధికారిక లెక్కలే చెబుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో 18 నుండి యావ సంవత్సరం మధ్య వయస్సు వారిలో ఉపాధి లేనివారు ఒక కోటి 56 లక్షల మంది ఉన్నారని ప్రభుత్వ గణాంకాలు తెలియజేస్తున్నాయని తెలిపారు. అలాగే ఆంధ్ర రాష్ట్రాన్ని నిరుద్యోగ రాష్ట్రంగా మార్చకముందే రాష్ట్రం నిరుద్యోగ యువత మేలుకోవాలని ముఖ్యమంత్రి  సూపర్ సిక్స్ లో యువతకి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, నిరుద్యోగ భృతి నెలకు 3000 రూపాయలు అందివ్వాలని, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులు భర్తి చేయాలి.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *