PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బద్వేల్​లో భారీమెజార్టీతో జగనన్న మాట నిలబెడదాం..! మేయర్​ సురేష్​బాబు

1 min read

పల్లెవెలుగువెబ్​, కడప: కడప జిల్లా బద్వేల్​ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి డాక్టర్​ సుధను భారీ మెజార్టీతో గెలిపించేందుకు ప్రతిఒక్కరూ సమష్ఠిగా కృషి చేసి జనగన్న మాట నిలబెట్టాలని కడప మేయర్​, పార్లమెంటరీ అధ్యక్షులు సురేష్​బాబు అన్నారు. ఈమేరకు మంగళవారం కలసపాడులోని మనోహర్​రెడ్డి కళ్యాణమండపంలో మాజీ ఎమ్మెల్సీ గోవిందరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైసీపీ మండల స్థాయి బూత్​ కమిటీ సభ్యులు, పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లడారు. ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు బూత్​కమిటీ సభ్యులు పార్టీ విధివిధానాలకు అనుగుణంగా పనిచేయాలని కోరారు. సమావేశంలో కడప ఎంపీ అవివాష్​రెడ్డి, కలసపాడు ఎన్నికల పరిశీలకులు, రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్​రెడ్డి, బద్వేల్​ అభ్యర్థి డాక్టర్​ సుదా, మండల నాయకులు గురివిరెడ్డి, సుదర్శన్​, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Author