మాదాసి… మదారి కురువ నూతన కార్యవర్గం ఎన్నిక
1 min read
న్యూస్ నేడు హొళగుంద : ఆదివారం ఆదోని శ్రీ శ్రీ బీరప్ప స్వామి ఫంక్షన్ హాల్ నందు కర్నూలు జిల్లా కురువ /మాదాసి కురువ /మదారి కురువ సంఘం రిజిస్ట్రేషన్ నంబర్ 168/1989. E. C. సమావేశం నందు గౌరవనీయులు కురువ /కురుబ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ పెద్ద హరివాణం మాన్వి దేవేంద్రప్ప ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా కురువ/మాదాసి కురువ మదారి కురువ సంఘం కు నూతన జిల్లా కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది . అందులో భాగంగా మా హొళగుంద మండలం ఎల్లార్తి గ్రామానికి చెందిన కురువ పెద్ద దర్గన్న ను కర్నూలు జిల్లా కురువ /మాదాసి /మాదారి కురువ సంఘం అసోసియేట్ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. సంఘం జిల్లా అసోసియేట్ నూతన అధ్యక్షునిగా ఎన్నికైన దరగన్నను మండల కురువ సంఘం నాయకులు ఆయన స్వగృహం నందు ఈరోజు ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అసోసియేటెడ్ అధ్యక్షుడు ధరగన్న మాట్లాడుతూ జిల్లాలో కురువలు విద్యా,ఉద్యోగ,రాజకీయ,రంగంలో వెనుకబడి ఉన్నారు అని కురువల అభ్యున్నతికి తన వంతు బాధ్యతగా కృషి చేస్తానని పేర్కొన్నారు.అదేవిధంగా తనను జిల్లా కురువ సంఘం అసోసియేటెడ్ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న కులస్తులకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కురువ సంఘం యువ నాయకులు ఎల్లార్తి ఎంపీటీసీ సభ్యులు బసప్ప బంధాప్ప,రంగస్వామి, ముద్దటమాగి చాగప్ప,గర్జన్న,లింగంపల్లి భీమ లింగ,ఎండీ హళ్లి నాగరాజు,లింగన్న,లక్ష్మీకాంత్,బొంగుండనహళ్లి మారేష్ మరియు సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.