ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పకడ్బందీగా చేయండి
1 min read
జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
కర్నూలు, న్యూస్ నేడు : రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా సంబంధిత అధికారులను ఆదేశించారు.గురువారం సాయంకాలం ఈ నెల 17 వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో సీ క్యాంప్ రైతు బజార్, ప్రజా వేదిక కు సంబంధించి చేస్తున్న ఏర్పాట్లను ఎస్పీ తో కలిసి కలెక్టర్ పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ ముందుగా సి క్యాంప్ లో ఉన్న రైతు బజారు లో చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు.. ప్రతి షాప్ వద్ద బిన్ లను చేయాలని, నంబర్ లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.. అదే.విధంగా పైన గ్రీన్ షెడ్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.. పనులు త్వరితగతిన చేయాలని, ఎప్పటికపుడు పనులు ఎంతవరకు పూర్తయ్యాయని అప్డేట్ ఇస్తూ ఉండాలని కలెక్టర్ మార్కెటింగ్ అధికారులను ఆదేశించారు.. మార్కెట్ లోపల, బయట పరిసరాలు , టాయిలెట్ లు శుభ్రంగా ఉండే విధంగా చూసుకోవాలన్నారు.. అనంతరం ధనలక్ష్మి నగర్ లో స్వచ్ఛ ఆంధ్ర పార్క్ కు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్న సందర్భంగా అక్కడ కోడ్ ఏర్పాట్లను పరిశీలించారు..పార్కు లో ప్లాంటేషన్ ప్రోగ్రాం ఏర్పాటు చేయాలని కలెక్టర్ అటవీశాఖ అధికారిని ఆదేశించారు.. పార్కు సుందరీకరణ వివరాలను తెలియజేసే విధంగా ఫ్లెక్సీను రూపొందించాలన్నారు. అనంతరం కేంద్రీయ విద్యాలయం పక్కన ఉన్న ఖాళీ స్థలంలో ప్రజావేదిక ఏర్పాటుకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు.. బందోబస్తు, పార్కింగ్, వేదిక తదితర ఏర్పాట్లపై ఎస్పీ, సి ఎం కార్యాలయ అధికారులతో కలిసి చర్చించారు.కార్యక్రమంలో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఆంధ్రప్రదేశ్ రైతు బజార్ సీఈవో మాధవి లత, మార్కెటింగ్ కమిషనర్ అండ్ డైరెక్టర్ విజయ సునీత, జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి.నవ్య, పత్తికొండ ఎమ్మెల్యే శ్యామ్ కుమార్,కర్నూలు ఆర్డీవో సందీప్, జిల్లా పరిషత్ సీఈవో నాసర రెడ్డి,జిల్లా అధికారులు, నాయకులు తిక్కారెడ్డి పాల్గొన్నారు.అంతకుముందు ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లలో భాగంగా జిల్లా ఎస్పీ తో కలిసి కలెక్టర్ ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ ను పరిశీలించారు.. ఎయిర్పోర్ట్ లో తగిన భద్రత చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ను ఆదేశించారు.