NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

21న యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయండి:ఆర్డీఓ

1 min read

విజయవంతం అయ్యేందుకు అధికారులు చొరవ చూపాలి

నందికొట్కూరు, న్యూస్​ నేడు:  ఈనెల 21వ తేదీన నందికొట్కూరు మరియు ఆత్మకూరు నియోజకవర్గంలో జరిగే 11వ జాతీయ యోగా దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని ఆత్మకూరు రెవెన్యూ డివిజనల్ అధికారి డి నాగజ్యోతి పిలుపునిచ్చారు అన్నారు.ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ నంద్యాల జిల్లా కలెక్టర్ జి.రాజ కుమారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని  21న శ్రీశైలం,నందికొట్కూరు నియోజకవర్గాల్లోని ఆయా మండలాల్లో ఉన్న సచివాలయ పరిధిలో అన్ని శాఖల అధికారులు తమ సిబ్బందితో తప్పనిసరిగా హాజరై ఈ యోగ కార్యక్రమంలో పాల్గొనాలని అన్నారు.అంతే కాకుండా యోగా చేయడం వల్ల ఆరోగ్యపరంగా కలిగే లాభాల గురించి గ్రామాల ప్రజలకు వివరిస్తూ ప్రజలు అధిక సంఖ్యలో వచ్చే విధంగా అవగాహన కల్పిస్తూ ప్రజలు అధిక సంఖ్యలో వచ్చే విధంగా చూడాలని ఆర్డీవో అధికారులను ఆదేశించారు. ఈ రెండు నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు పాల్గొంటారని ఆర్డీవో డి.నాగ జ్యోతి బుధవారం తెలిపారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *