PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆటోను తప్పింబోయి.. బాలుడిపై దూసుకెళ్లిన ట్రక్కు…!

1 min read

పల్లెవెలుగు వెబ్​, పత్తికొండ : ఆటోను తప్పించబోయిన ట్రక్కు… సైకిల్​పై వెళ్తున్న బాలుడిపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో బాలుడు మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం మద్దికెర మండలం పెరవలి గ్రామంలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

పెరవలి నుండి మద్దికెర కు వెళ్లే రహదారి లో ప్రభుత్వ ఉన్నత పాఠశాల వద్ద కంకర లోడుతో వెళ్తున్న ట్రక్కు(కె ఏ 34 బి6568 ).. ఆటోను తప్పింబోయి సైకిల్ పై వెళ్తున్న రంగస్వామి(12) అనే బాలుడి పై దూసుకెళ్లింది. తీవ్ర గాయాలైన రంగస్వామిని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. బాలుడి మృతితో తల్లిదండ్రుల రోదన చూపరులను కంటతడి పెట్టించింది.

About Author