PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైఎస్‌ఆర్ మరణంపై ఎంపీ మోపిదేవి సంచలన వ్యాఖ్యలు

1 min read


పల్లెవెలుగు వెబ్: వైసీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి మరణంపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు. వైఎస్‌ఆర్ మరణంలో చంద్రబాబు కుట్ర ఉందేమోనన్న అనుమానం కలుగుతోందన్నారు. ఇటీవల వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు స్పందిస్తూ.. ‘గాలిలో ఎగిరి గాలిలో కలిసిపోతావు’.. అంటూ వ్యాఖ్యానించారు. దీంతో చంద్రబాబుపై అనుమానం వ్యక్తం చేశారు మోపిదేవి. బాబు వ్యాఖ్యలను బట్టి చూస్తే.. వైఎస్సార్‌ మరణంలో చంద్రబాబు కుట్ర ఉందా.. అనే అనుమానాలకు మరింత బలం చేకూరుతుందన్నారు. ఏ ఉద్దేశంతో సీఎం జగన్‌పై అటువంటి వ్యాఖ్యలు చేశారో బాబు చెప్పాలని మోపిదేవి డిమాండ్ చేశారు.

About Author