అసెంబ్లీ ఘటనపై తొలిసారి స్పందించిన నారా భువనేశ్వరి
1 min read

పల్లెవెలుగు వెబ్: అసెంబ్లీ ఘటనపై తొలిసారి స్పందిచారు చంద్రబాబు సతీమణి. ఈ మేరకు నారా భువనేశ్వరి ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. అసెంబ్లీ ఘటన తరువాత తనకు అండగా నిలబడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. తమ తల్లిదండ్రులు తమను ఎంతో క్రమశిక్షణతో పెంచారని భువనేశ్వరి పేర్కొన్నారు. ఇతరుల గౌరవాన్ని, వ్యక్తిత్వాన్ని భంగం కలిగించేలా ఎవరూ ప్రవర్తించకూడదన్నారు. తనకు జరిగిన అవమానం మరే మహిళకు జరగకూడదని ఆశిస్తున్నట్లు భువనేశ్వరి పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.

