NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నిక‌ల రీనోటిషికేష‌న్ కేసు వాయిదా

1 min read

అమ‌రావ‌తి: ఆంధ్రప్రదేశ్ లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నిక‌ల‌కు రీ నోటీఫికేష‌న్ ఇవ్వాలంటూ దాఖ‌లైన పిటిష‌న్ సంబంధించిన కేసు శుక్రవారం హైకోర్టులో విచార‌ణ జ‌రిగింది. జ‌న‌సేన కు సంబంధించిన పిటిష‌నర్ త‌ర‌పు న్యాయ‌వాది ఎన్నిక‌ల‌కు రీనోటీఫికేష‌న్ ఇవ్వాల‌ని కోరారు. గ‌తంలో చాలా ప్రాంతాల్లో పిటిష‌న‌ర్ త‌ర‌పు పార్టీ అభ్యర్థులు నామినేష‌న్ వేయ‌కుండా అధికార పార్టీకి సంబంధించిన వారు అడ్డుకున్నార‌ని తెలిపారు. దీంతో కౌంట‌ర్ అఫిడ‌విట్ వేసేందుకు స‌మ‌యం కావాల‌ని ఎన్నిక‌ల సంఘం కోరింది. దీంతో కేసును 8వ‌ తేదికి వాయిదా వేసింది హైకోర్టు.

About Author