PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భద్రత ఏర్పాట్లను పరిశీలించిన నంద్యాల జిల్లా ఎస్పీ

1 min read

పల్లెవెలుగు, వెబ్​ నంద్యాల: నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ కె.రఘువీర్ రెడ్డి IPS గారు ఈనెల 17న గౌరవ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వై.యస్ జగన్మోహన్ రెడ్డి గారు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణానికి మూడో విడత రైతు భరోసా కార్యక్రమానికి రానున్న సందర్భంగా మీటింగ్ స్థలం హెలిపాడ్ నందు జరుగుతున్న ఏర్పాట్లను మరియు తీసుకోవలసిన భద్రతా చర్యలను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు.అనంతరం హెలిపాడ్ వద్దనుండి బస్సు తో మీటింగ్ స్థలం వరకు ట్రైల్ రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారితో పాటు ఆళ్లగడ్డ డిఎస్పి వెంకట్రామయ్య గారు సిఐ లు జీవన్ బాబు గారు రాజశేఖర్ రెడ్డి గారు ఆర్ అండ్ బి అధికారులు వారి సిబ్బంది పాల్గొన్నారు.

About Author