NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నిత్యానంద స్వామి ప్రాణాల‌కు ముప్పు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : అత్యాచారం కేసులో నిందితుడైన నిత్యానంద స్వామి ప్రాణాలకు ముప్పు ఏర్పడింది. తీవ్ర అస్వస్థతకు గురైన స్వయం ప్రకటిత ఆధ్యాత్మిక గురువు, అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద వైద్యసాయం కోసం సాక్షాత్తూ శ్రీలంక అధ్యక్షుడికి లేఖ రాశారు.రణిల్ విక్రమసింఘేకు నిత్యానంద రాసిన లేఖ తాజాగా వెలుగుచూసింది. అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద శ్రీలంకలో రాజకీయ ఆశ్రయం కోరుతున్నట్లు సమాచారం.తన ఆరోగ్యం క్షీణించిందని, ఆశ్రయం కల్పించి వైద్యసాయం చేయాలని కోరుతూ భారతదేశం నుంచి పారిపోయిన నిత్యానంద ఆగస్టు 7వతేదీన ద్వీప దేశ అధ్యక్షుడికి లేఖ రాశారు.

                                                 

About Author