PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పెండ్లి ప‌త్రిక‌లో పేరు వేయ‌లేద‌ని.. క‌త్తితో దాడి !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: పెండ్లి పత్రిక‌లో పేరు వేయ‌లేద‌న్న కోపంతో క‌త్తితో దాడి చేశాడు ఓ వ్యక్తి. సికింద్రాబాద్ తుకారం గేట్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చంద్రశేఖ‌ర్ న‌గ‌ర్​లో ఘ‌ట‌న జ‌రిగింది. చంద్రశేఖ‌ర్ న‌గ‌ర్ లో కొన్ని రోజుల క్రితం సురేష్ అనే వ్యక్తికి పెళ్లి జ‌రిగింది. ఆ పెళ్లిలో త‌న పేరు వేయ‌లేద‌ని స‌ర్వేశ్ అనే వ్యక్తి గొడ‌వ‌కు దిగాడు. సురేష్ సోద‌రి బాల‌మ‌ణిని దూషించాడు. అయితే.. బంధువులు స‌ర్ది చెప్పి.. ఇంటికెళ్లి మాట్లాడుదామ‌ని చెప్పారు. దీంతో సురేష్ సోద‌రి బాల‌మ‌ణి బంధువుల‌తో స‌హా స‌ర్వేష్ ఇంటికి వెళ్లింది. ఇంటికి వ‌చ్చిన బంధువుల మీద స‌ర్వేష్‌, అత‌ని సోద‌రుడు క‌త్తితో దాడికి దిగాడు. విచ‌క్షణార‌హితంగా దాడి చేశాడు. దీంతో బంధువులైన ప్రవీణ్, ప‌రుశురాములు, యాద‌గిరి, ప్రతాప్ కుమార్ కు తీవ్ర గాయాల‌య్యాయి. గాయ‌ప‌డిన వారిని ఉస్మానియా ఆస్పత్రికి త‌ర‌లించారు. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

About Author