PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఒక్క సోష‌ల్ మీడియా పోస్ట్.. పోలీసుల‌కు గాయాలు !

1 min read

పల్లెవెలుగువెబ్ : క‌ర్ణాట‌క‌లో హుబ్బళిలోని ఆనంద్ నగర్ హింస‌తో అట్టుడుకింది. ఆనంద్ న‌గ‌ర్ కు చెందిన ఓ వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్ట్ శనివారం రాత్రి తీవ్ర అలజడిని సృష్టించింది. మసీదుపై కాషాయ జెండా ఉన్నట్లు కనిపిస్తున్న ఫొటోను ఆ వ్యక్తి పోస్ట్ చేయడంతో పాత హుబ్బళి ప్రాంతంలోని ఓ వర్గానికి చెందినవారు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించారు. పాత హుబ్బళి పోలీస్ స్టేషన్‌ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ఫొటోను పోస్ట్ చేసిన వ్యక్తిపై ఓ ముస్లిం సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఆ వ్యక్తిని తమకు అప్పగించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. అనంతరం ఈ నిరసన హింసాత్మకంగా మారింది. దుండగులు పెద్ద పెద్ద రాళ్ళతో పోలీస్ స్టేషన్‌, వాహనాలు, ఆసుపత్రి, దేవాలయంపై దాడి చేశారు. మరోవైపు నిందితుని తల్లిదండ్రులు, బంధువులు పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు హుబ్బళి పోలీస్ కమిషనర్ లభు రామ్ చెప్పారు. చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోరాదని చెప్పారు. పెద్ద సంఖ్యలో రాళ్ళు ఎలా వచ్చాయో తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

                                     

About Author