PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పంచ‌లింగాల చెక్ పోస్ట్.. బంగారం, వ‌జ్రాలు స్వాధీనం

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: క‌ర్నూలు జిల్లా పంచలింగాల సబ్ చెక్‌పోస్టు వద్ద అర కిలో బంగారు ఆభరణాలు, 57 వజ్రాలను పోలీసులు పట్టుకున్నారు. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో పట్టుబడిన ఈ బంగారం, వజ్రాల విలువ రూ. 39 లక్షల 28వేలు ఉంటుందని పోలీసులు తెలిపారు. రాజస్థాన్‌కు చెందిన కపిల్ అనే వ్యక్తి బంగారు ఆభరణాలు, వజ్రాలను హైదరాబాద్ నుంచి బెంగళూరుకు అక్రమంగా తరలిస్తున్నాడు. తనిఖీల్లో భాగంగా పోలీసులు వాటిని గుర్తించారు. కపిల్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

                           

About Author