PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రోజుకు రూ. 3 కోట్ల విరాళం !

1 min read

పల్లెవెలుగువెబ్ : రోజుకు 3 కోట్ల చొప్పున విరాళం ఇస్తూ దాతృత్వం విషయంలో తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ హెచ్‌సీఎల్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ (77). ఆయన ఈ ఏడాది ఇప్పటి వరకు రూ.1161 కోట్ల వరకు విరాళంగా అందించినట్టు ఎడెల్‌గివ్ హురూన్ ఇండియా పేర్కొంది. హురూన్ తాజాగా విడుదల చేసిన దాతృత్వ జాబితాలో శివ్ నాడార్ అగ్రస్థానంలో నిలిచారు. విప్రో వ్యవస్థాపకుడు అజీమ్ ప్రేమ్‌జీ (77) రూ. 484 కోట్ల విరాళం ఇచ్చి రెండో స్థానంలో నిలిచారు. ఈ విషయంలో అజీమ్ ప్రేమ్ జీ గతంలో వరుసగా రెండేళ్లు అగ్రస్థానంలో నిలిచారు. రూ. 411 కోట్ల విరాళంతో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ కుటుంబం ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచింది.

About Author