NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పార్వతీ పరమేశ్వరుల ఉత్సవమూర్తుల ఊరేగింపు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  జయ గురుదత్త శ్రీ గురుదత్త ఓం నమఃశివాయ ఆదివారం పవిత్రమైన కార్తీక మాసం సందర్భంగా కర్నూలు శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో శ్రీ మహా గౌరీ శంకర స్వామి వారికి రుద్రాభిషేకములు విశేషాలు జరిగినవి. అనంతరం రాత్రి పౌర్ణమి గల సందర్భంగా ఆది దంపతులు అయిన పార్వతీ పరమేశ్వరుల ఉత్సవమూర్తులను ఆలయ మాడవీధులలో ఊరేగింపు జరిపి ఆలయ ప్రాంగణంలో జ్వాలాతోరణం కార్యక్రమము నిర్వహించబడినది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పార్వతీ పరమేశ్వరుల ఉత్సవ మూర్తుల వెంట జ్వాలతోరణ ప్రదక్షిణం చేసుకుని తరించినారు మరియు ఆలయ ప్రాంగణంలో ఆలయ ఎగ్జిక్యూటివ్ ట్రస్ట్  T.శివరామకృష్ణ శ్రీదేవి  దంపతులు కోటివర్తి ప్రజ్వలనం కావించి షోడశోపచార పూజలు చేసుకున్నారు. అనంతరం దంపతీ పూజలు సువాసిని పూజలు జరుపుకున్నారు భక్తులు ఈ కార్యక్రమము అధిక సంఖ్యలో పాల్గొని పరమేశ్వర కృపకు పాత్రులు అయినారు అనంతరం భక్తులకు ప్రసాద వితరణ జరిగింది.

About Author