గంగవరం శివాలయం లో పూజలు నిర్వహించిన వీరశివారెడ్డి, సాయినాథ్ శర్మ
1 min read

పల్లెవెలుగు వెబ్ కమలాపురం: కమలాపురం మండలం గంగవరం గ్రామం లో ఎంతో ప్రసిద్ధి గాంచిన శ్రీ ఉమమహేశ్వర స్వామి ఆలయం లో ఈ రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వామి వారిని దర్శించి ప్రత్యేక పూజలు చేసిన కమలాపురం మాజీ ఎమ్మెల్యే జి.వీరశివారెడ్డి టిడిపి మాజీ రాష్ట్ర కార్యదర్శి కాశీభట్ల సాయినాథ్ శర్మ…ఈ సందర్భంగా వీరశివారెడ్డి ,సాయినాథ్ శర్మ లను ఆలయ నిర్వాహకులు మరియు గ్రామస్థులు ఘనంగ స్వాగతం పలికారు. తదనంతరం ఇరువురిని ఆలయ నిర్వాహకులు ఘనంగ సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

