నియోజకవర్గ అభివృద్ధిపై సవాల్ కు సిద్ధం
1 min read
సాదారణ నిధులు తప్ప ఏడాది పాలనలో నియోజకవర్గానికి రాఘవేంద్ర రెడ్డి పైసా ప్రత్యేక గ్రాంటు తెచ్చింది లేదు
మీ ఇంటికి జిల్లాస్థాయి గుర్తింపు తెచ్చిందే రాంపురం రెడ్డి సోదరులు
3,4 సార్లు పార్టీలు మారిన మీరు వెన్నుపోటుదారులు
వైకాపా జిల్లా ఉపాధ్యక్షులు ప్రదీప్ రెడ్డి
మంత్రాలయం , న్యూస్ నేడు : మంత్రాలయం నియోజకవర్గం అభివృద్ధి పై మంత్రాలయం టిడిపి ఇన్చార్జ్ మాధవరం రాఘవేంద్ర రెడ్డి చేసిన సవాల్ కు వైకాపా జిల్లా ఉపాధ్యక్షులు ప్రదీప్ రెడ్డి స్వీకరించి అభివృద్ధి పై సిద్ధం అని ప్రతి సవాల్ విసిరారు. సోమవారం మండల పరిధిలోని రాంపురం గ్రామంలో ఎమ్మెల్యే నివాసంలో ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో పదిసార్లు అయినా మేమే ఎమ్మెల్యేగా గెలుస్తాం ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధి పై ఎక్కడికి రమ్మంటే అక్కడికి అభివృద్ధిపై చర్చకు సిద్ధం అని సవాల్ విసిరారు. వందల ఎకరాల భూములు మురళీ రెడ్డి తీసుకోలేదు, కేవలం ఒకఎకరం మాత్రమే మురళీ రెడ్డి పేరు మీద ఉంది,ఆ భూమి కోర్టు ద్వారా గాని లేదా రెవెన్యూ అధికారులు తప్పు అని నిర్ణయిస్తే తిరిగి వారి పేరు మీద చేస్తాం అన్నారు. రాఘవేంద్ర రెడ్డి మా కుటుంబ సభ్యులు వెన్నుపోటు రాజకీయాలు చేశారని పెర్కోనడం హస్యాస్పదమని అన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ వై ప్రదీప్ రెడ్డి గారు అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు రాఘవేంద్ర రెడ్డి వెన్నుపోటు రాజకీయాలు, అభివృద్ధి పనులపై చేసిన సవాలును స్వీకరిస్తామని,మీరు ఎక్కడ కావాలంటే అక్కడ చర్చలకు సిద్ధమని ప్రతి సవాలు విసిరారు.నియోజకవర్గ అభివృద్ధికి సాదారణ నిధులే తప్ప తమ కూటమి ప్రభుత్వంను ఒప్పించి,ప్రత్యేక నిధులు తెచ్చింది ఏమి లేదని ఎద్దేవా చేశారు. బడాయి మాటలు అపి,అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. ఇక వెన్నుపోటు రాజకీయాలకు పెట్టింది పేరు మీ కుటుంబానికే చెందిందని, 2009లో తేదేపా నుండి ప్రజారాజ్యం,వెంటనే ప్రజారాజ్యంను వీడి వైఎస్ ఆర్ సమక్షంలో కాంగ్రెస్ లోకి,మళ్లీ కాంగ్రెస్ నుంచి తెదేపా,2014 ఎన్నికల సమయంలో వైఎస్సార్సీపీ చేరి అధికారం అనుభవించి,తీరా 2024లో శ్రీరంగ నీతులు చెప్పే రాఘవేంద్ర రెడ్డి వైకాపాను వీడి తెదేపాలో చేరడంతో వెన్నుపోటు రాజకీయాలు చేసింది ఎవరో ప్రజలకు తెలుసని తెలిపారు. అందుకే కూటమి ప్రభుత్వం సునామీలో ప్రజలు నిన్ను తిరస్కరించారని ఆయన ఎద్దేవా చేశారు.మీ ఇంటికి గ్రామ స్థాయి నుంచి జిల్లాస్థాయిలో గుర్తింపు తెచ్చింది ఒక్క రాంపురం రెడ్డి సోదరులే అని అన్నారు. నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు,దేవుని ఆశీస్సులతో పదిసార్లు ఎమ్మెల్యేగా రాంపురం రెడ్డి సోదరులే గెలుస్తారని అయన ధీమా వ్యక్తం చేశారు. వంద ఎకరాల భూములను మురళీ మోహన్ రెడ్డి కబ్జా చేశారన్న వ్యవహారంపై న్యాయ, రెవెన్యూ విచారణలో మాది తప్పిదం అని తేలితే మురళీ రెడ్డి పేరు మీద ఉన్న ఎకరం భూమి తిరిగి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో వైకాపా మండల అధ్యక్షులు బీంరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి పురుషోత్తం రెడ్డి,మాధవరం రాజశేఖర రెడ్డి, రాంమోహన్ రెడ్డి,చంద్రశేఖర్ రెడ్డి, రఘురాం,గజేంద్ర రెడ్డి,శివరాం రెడ్డి,బెట్టనగౌడ్,నాగరాజు, మహాంతేష్ స్వామి,దొడ్డి నర్సన్న,నరసింహులు గౌడ్, ప్రహ్లాద చార్,అమరేష్,బుజ్జి స్వామి,ఎకాంబ రెడ్డి,మాబుసాబ్ తదితరులు పాల్గొన్నారు.
