PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జగనన్న సంక్షేమాన్ని కొనసాగించడానికి కర్నూల్ ప్రజలు సిద్ధం

1 min read

కొండ రెడ్డి బురుజు పై జెండా ఎగుర వేస్తాం ఎస్ వి దంపతులు

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూల్ మాజీ ఎమ్మెల్యే శ్రీ ఎస్ వి మోహన్ రెడ్డి గారు మరియు ఉమ్మడి కర్నూల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు అధ్యక్షురాలు శ్రీమతి ఎస్ వి విజయ మనోహరి గారు వారి స్వగృహం లో 33 వార్డ్ లకు చెందిన వైస్సార్సీపీ నాయకులు, మహిళా కార్యకర్తలు ఎస్ వి యూత్ సభ్యుల మధ్య  జగన్నన్న అండగా  మేము *సిద్ధం*పోస్టర్ ను ఆవిష్కరణ చేసారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ జగన్నన్న సంకల్పం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అని జగన్నన్న కు తోడుగా కర్నూల్ ప్రజలు నాయకులు తమ వెంట ఉన్నారు అని 2024 ఎన్నికల లో కొండారెడ్డి బురుజు పై వైస్సార్సీపీ జెండా ఏగుర వేస్తాం అని తెలిపారు. కర్నూల్ ప్రజలు తమ కుటుంబం ను అదరిస్తారు అనే నమ్మకం ఉంది అని వారు తెలిపారు కార్యక్రమం లో కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

About Author